తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday 30 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 4.... కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..


           కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..
కార్తీక్ ని అభినందించడానికి మాధవి, చందన ఇద్దరు వచ్చారు. "కంగ్రాట్స్ అన్నయ్యా! పార్టీ ఎప్పుడు" అడిగింది చందన.

          మీరెప్పుడంటే అప్పుడే.... చెప్పాడు కార్తీక్.  "కంగ్రాట్స్ అండి" ఎంతో అభిమానంతో చెప్పింది మాధవి.
తనే ఐ.ఎ.ఎస్. పాస్ అయినంత సంతోషంగా ఉందామెకు. అలా కాసేపు మాట్లాడుకున్నారు. 
మాట్లాడుకున్నంతసేపు ఒకరి వైపు ఒకరు ఎంతో ఆర్తిగా చూసుకుంటున్నారు.
కార్తీక్, మాధవి లు ఇద్దరూ ఒకరంటే ఒకరికి మనసులో ఉన్న  ప్రేమను  బయటపెట్టుకోలేక
తల్లడిల్లిపోతున్నారు. 

     రాత్రంతా తనతో గడిపిన హిమబిందువు సూర్యకిరణాల వేడికి కరిగి, తనను వీడలేక వేడే వేళ చిగురుటాకు పడే మనోవేదన వారిద్దరి హృదయాలను అవరించుకుని ఉంది.

          "సరే ఇంక వెళ్తా కార్తీక్ గారు" చెప్పింది మాధవి.

          సరేనండి ఒకింత బాధగా అన్నాడు కార్తీక్.

          చందన గేటు వరకు వెళ్ళి మాధవి ని సాగనంపి వచ్చి, అన్నయ్యా! నీకు, మధు కి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం అని నాకు తెలుసు. ఎవరికి ఎవరు చెప్పు కోవడం లేదు. తనకి నువ్వంటే చాల ఇష్టం. నీకు చెప్పలేక, ఒకవేళ చెప్తే దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే ఎలా అని నలిగిపోతోంది. నువ్వు మాధవి కి ప్రపోజ్ చెయ్యడం కంటే వాళ్ళనాన్న గారితో మాట్లాడు. తను వాళ్ళ అమ్మా, నాన్న మాటను కాదని ఏదీ చెయ్యదు అని చెప్పింది చందన.

          అదేమంచిది అనిపించింది కార్తీక్ కి కూడా.
         ఒకరోజు మాధవి వాళ్ళ ఇంటికి వచ్చాడు కార్తీక్. సమయానికి వాళ్ళ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు.


                                                                                                                                    ఇంకా వుంది......

ప్రేమ కూడా ఎంతో మధురంగా కనబడుతుంది.........ఇంత కర్కశంగా మనసుని చీలుస్తుందా అనిపించేటట్లు


ప్రేమ కూడా 
ఎంతో మధురంగా కనబడుతుంది.......
ఇంత కర్కశంగా 
మనసుని చీలుస్తుందా అనిపించేటట్లు......
ప్రేమ బారిన పడి... 
అది పెట్టే బాధ కు విలవిలలాడే వాళ్లకు తెలుస్తుంది....
ప్రేమ ఎంత కర్కశమైనదో.....


మంచు కూడా ఎంతో స్వచ్చంగా అమాయకంగా కనిపిస్తుంది...
కానీ మనిషినే తినేస్తుంది దానిలో చిక్కుకుంటే......
దానిపేరే ఫ్రాస్ట్‍బైట్....

Friday 29 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 3


చందన అలోచనలు కొన్ని సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను తిరగేసాయి. 

అప్పుడు మాధవి, చందనలు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్.  కార్తీక్ ఐ.ఐ.టి. లో M.Tech. పూర్తిచేసి సివిల్స్ రాస్తున్నాడు. చందనకు కార్తీక్ అన్నయ్య వరుస అవుతాడు. 

         మాధవి పట్టు పరికిణీలో పదహారణాల స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి లా ఉండేది.  అందం, తెలివి, అణకువ,  పెద్దలంటే వినయ విధేయతలు కలబోసిన మధ్యతరగతి అమ్మాయి.

          కానీ కార్తీక్ కొన్ని వందల కోట్ల సంపదకు వారసుడు. మృదుస్వభావి. చక్కగా ఉంటాడు. కానీ అతనిలో తాను ధనవంతుడు అన్న భావన ఎక్కడా కనబడదు. సేవాభావం ఎక్కువ.  వీలైనంత ఎక్కువ మంది సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం అతనిది. ఒక ఆఫీసర్ గా ఎక్కువమంది సేవ చెయ్యవచ్చుననే  అలోచనతోనే అతను సివిల్స్ రాస్తున్నాడు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు.

          ఐ.ఐ.టి. లో చేరిన కొత్తలో చందన పుట్టినరోజు పార్టీలో మాధవిని చూశాడు.
చూడగానే తనని తాను మర్చిపోయాడు. "ఈ అమ్మాయి తన భార్య అయితే తనంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనిపించింది. మాధవి కు కూడా కార్తీక్ ని చూడగానే గుండె ఝల్లుమంది. చూడగానే అతని పట్ల అభిమానం ఏర్పడింది. ఒకరినొకరు మౌనంగా అభిమానంగా చూసుకునేవారు. ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఏర్పడింది.
కానీ ఎవ్వరూ బయటపడలేదు.  

          అలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. మాధవి ఇంజనీరింగ్ పూర్తికావచ్చింది.
కార్తీకి సివిల్స్ లో దేశం మొత్తానికి టాపర్ గా నిలిచి అత్యున్నత సర్వీస్ ఐ.ఎ.ఎస్. కి సెలెక్ట్ అయ్యాడు. 

                                                                                                   ఇంకా వుంది......

దుఃఖం.... భయం..... ఘర్షణ.... వీటన్నింటిని మించిన భయంకరమైన స్థితి.....


మనసును కష్టపెట్టే విషయం ఏదైనా జరిగితే, 
మనసుకి బాధ కలుగుతుంది. మనకి ఇష్టంలేని
విషయం ఏదైనా చెయ్యాల్సి వస్తే మనసులో ఘర్షణ కలుగుతుంది. 
భరించలేనంత దుఃఖం కలుగుతుంది. మనసూ దుఃఖిస్తుంది.

ఆనందం ... దుఃఖం.... భయం..... ఘర్షణ....
ఇవన్నీ మనసుకు సంబంధించిన రకరకాల స్థాయీ భావాలు.  

కానీ... వీటన్నింటిని మించిన భయంకరమైన స్థితి.....మరొకటి ఉన్నది......

అదే....... మనసులో నిశ్శబ్దం నిద్రపోవడం......మనసులో శూన్యం ఏర్పడడం.

ఏమీ తోచదు. బాధ వేస్తుంది. కానీ ఎందుకు బాధ పడుతున్నామో తెలియదు.
కోపంగా, విసుగ్గా, చిరాగ్గా మాత్రం ఉంటుంది.
ఎందుకు విసుక్కుంటున్నామో, ఎందుకు చిరాకు పడుతున్నామో, ఎందుకు కోప్పడుతున్నామో కూడా తెలియదు. మన సొంతవారి మీదనే కేకలేస్తుంటాము.  

పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ప్రియుడితో లేచిపోయి .....

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై నా అభిప్రాయం


బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ లో సుమలత తనకన్నా వయసులో పెద్దవారితో పాదనమస్కారం చేయించుకోవడం బాలేదు.  కుటుంబ సమస్యలతో బాధ పడే వారు చాలా మంది ఉన్నారు.  అత్తింట్లో ఆరళ్ళకు, భర్త పెట్టే బాధలకు తట్టుకోలేక నరకయాతన పడేవారు చాలామంది ఉన్నారు. అసలు నూటికి 90  శాతం మహిళలకు D.V. Act (Domestic Violence Act   గురించి కానీ,  498A section  గురించి కానీ తెలియదు. అటువంటి వారికి Law గురించి, Law లో మహిళలకు ఉన్న హక్కుల గురించి కొంత తెలియజేసే ప్రయత్నం అభినందించదగ్గదే.  సైకాలజిస్ట్, లాయర్, లాంటి నిపుణులతో కౌన్సిలింగ్ చేయించి పరిష్కారం సూచించటం కూడా బాగుంది.


 సంపన్నులను, మధ్యతరగతి వారిని వదిలేసి కేవలం  బీదవారిని మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి పిలుస్తున్నారేమో అనిపించినా ఈ మధ్య వచ్చిన కొన్ని ఎపిసోడ్స్ లో మధ్య తరగతి వారు కూడా ఉన్నారు.  సంపన్నులకు, కోట్ల కొలది డబ్బు ఉన్నవాళ్ళలో చాలామంది మన సంస్కృతి పై పెద్దగా పట్టింపులేదు.  న్యాయాన్నే కొనగలిగేంత స్తితిలో ఉన్నవాళ్ళకు ఈ ప్రోగ్రామ్ కి రావాల్సిన అవసరం లేదు. 


 ఎటొచ్చీ మధ్యతరగతి వారికి, పేదవారికి న్యాయసహాయం అవసరం. కానీ కొన్ని సన్నివేశాలను ఎడిట్ చెయ్యాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా వాళ్ళు చానల్ లో చూపించే సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ప్రియుడితో లేచిపోయి  ఒక నెల గడిపి మళ్ళీ తిరిగి భర్త దగ్గరకు వచ్చి నాపిల్లలు నా భర్త కావాలి అని వచ్చిన భార్య..... ఇలాంటి సమస్యలతో వచ్చేవారికి కౌన్సిలింగ్ చేసి అలాంటి వాటిని ప్రసారం చెయ్యకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.

Thursday 28 April 2011

నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే..........


నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే
దాన్ని పట్టుకుని వాదించి గెలవడం,
అవతలి వారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవడం...
గొప్ప వాళ్ళ లక్షణం అయితే కావచ్చు....


కానీ...


అవతలి వాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు
 ప్రవర్తించడం మహోన్నతుల స్వభావం.

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై మీ కామెంట్...ప్లీజ్...


నేను సాధారణంగా టి.వి. లొ ఎటువంటి సీరియల్ చూడను. కానీ ఈ మధ్య మా ఆవిడ బలవంతం మీద  బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ చూస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఇంట్లోను, ప్రతి భార్యా భర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు సహజం.  సర్దుకుపోతేనే సంసారం బాగుటుంది.  భార్య, భర్త ఇద్దరు పట్టింపులకు, పంతాలకు పోతే వారి మధ్య దూరం పెరగడమే కాకుండా అది ఇంకా చాలా దూరం వెళ్తుంది.

గొడవలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  జీవితంలో ఒక్కోసారి రాజీ పడడం అనేది తప్పనిసరి. మరీ జీవితమే రాజీ అంటే కష్టమే.  చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఎలా పెద్దవై ఎంత దూరం వెళ్తున్నాయో, ఎంతమంది జీవితాలు నాశనమవుతున్నాయో మన కళ్ళెదురుగా ఆ ప్రోగ్రామ్ లో చూపెడుతున్నారు.  ఒక సైకాలజిస్ట్ ని, ఒక లాయర్ ని కూర్చోబెట్టి అందరికి అర్దమయ్యేలా వివరిస్తున్నారు.  చాలామంది జీవితాలు ఈ ప్రోగ్రామ్ వల్ల బాగుపడుతున్నాయి.
సుమలత గారిది చాలా మంచి ప్రయత్నం.  ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ చూడండి. అందరికి చూడమని చెప్పండి.
దీనివల్ల కొంతమేలు జరిగినా మంచిదే కదా. నా అభిప్రాయం చెప్పాను. మీ అభిప్రాయం చెప్పండి.

జి తెలుగు  వారి ప్రయత్నానికి హ్యాట్సాఫ్.......

Wednesday 27 April 2011

నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా.......



నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా.......


ఎవరితోనూ మాట్లాడబుద్ది కాదు.
పగలూ, రాత్రిళ్ళూ.... అలా.. నిశ్శబ్దంగా ...
వెలుగు చీకట్లలోకి ఒంటరిగా స్తబ్దంగా చూస్తూ
ఉండిపోవాలనిపిస్తుంది.


ఎందుకంటే....


ఆ నిశ్శబ్దంలో నాకు నీ శబ్దం వినబడుతుంది.
మనసును రాగరంజితం చేస్తుంది.
మనసులోని బాధంతా ఎవరో చేత్తో తీసేసినట్టు
దూదిపింజలా ఎగిరి తేలికైపోతుంది.


నీలిమేఘం తడిని వదుల్చుకోవాలంటే....
చల్లగాలి తెమ్మెరను సాయమడగాలి..
మనసుకోరికను వదుల్చుకోవాలంటే... 
నెచ్చెలి మనసునే సాయమడగాలి....


నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా....నాకు..నేను గుర్తు రాను.


ఎందుకంటే...


నేనెపుడో...నువ్వైపోయాను కాబట్టి....

Tuesday 26 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 2. ఇది నేను రాసిన తొలి రచన...చదివి చెప్పండి....


రెండవ భాగం......


రెండడుగులు వేసే సరికి కార్తీక్ క్రింద పడిపోయాడు.  అతన్ని జాగ్రత్తగా పట్టుకుని, అందంగా పెంచబడి ఉన్న పూలమొక్కల మధ్య ఉన్న ఒక పాలరాతి మందిరం దగ్గరకు అతన్ని తీసుకెళ్ళారు. దాని మధ్య లో పాలరాతి తో నిర్మించబడిన ఒక సమాధి ఉంది. దానిని చూడగానే చందన కళ్ళు జలపాతాలయ్యాయి.
కార్తీక్ నెమ్మదిగా ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దానిని తడిమి "ఇక మీరు వెళ్ళండి" ఆన్నట్టు సైగ చేసి ఆ సమాధి మీద తల పెట్టుకుని కూర్చున్నాడు.

"ఇంటికి రా కార్తీక్" దీనంగా అడిగింది చందన.
అతను రానన్నట్టు తల ఊపి వెళ్ళిపోమన్నాడు.

ఇక చేసేదేమీ లేక అక్కడే ఉండి ఆ పూలమొక్కలను, సమాధి ని జాగ్రత్తగా చూసుకునే కాపరికి డబ్బిచ్చి, అవసరమైతే వెంటనే ఫోన్ చెయ్యమని ఫోన్ నంబర్ ఇచ్చి, కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇద్దరూ అక్కడ్నించి వచ్చేశారు.

కుమార్ కు అంతా పజిల్ గా ఉంది. అసలేమీ అర్దం కావడం లేదు.

చందన ఏమీ మాట్లాడలేదు.

కుమార్ రెట్టించి అడిగాడు.  చందనా అతనెవరు? అసలేమిటిదంతా?

వారిద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.

కాసేపటికి మెల్లగా గొంతి విప్పింది చందన.

మాధవి కాన్సర్ ట్రస్ట్ ని నెలకొల్పింది అతనే మెల్లగా చెప్పింది.

తలమీద పిడుగు పడ్డట్టు అదిరిపోయాడు కుమార్.

ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయలను కాన్సర్ బాధితులకు అందజేసే కార్తీక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఒకటైన మాధవి కాన్సర్ ట్రస్ట్ ను స్థాపించింది అతనే అంటే నమ్మలేకపోతున్నాడు.

చందనతో అదే అన్నాడు.

అంతే కాదండీ! కార్తీక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అధినేతే అతను.

అతనే కార్తీక్.  చెప్పింది చందన.

ఒక నమ్మలేని నిజాన్ని వింటున్నట్టుగా ఉందతనికి.  దానితో పాటే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత నిమిష నిమిషానికి అధికమవసాగింది.


ఇంకా వుంది......

నిజమా?....కాదా?..... ఏమో మరి మీరే చెప్పండి.


1)         If you come early, the bus is late. If you come late…… the bus is still late.
2)         Whenever I find the key to success, someone changes the lock.
3)         The road to success.. is always under construction.
4)         In order to get a Loan, you first need to prove that you don't need it.
5)         Anything dropped on the floor will roll over to the most inaccessible corner.
6)         If you have paper, you don't have a pen……. If you have a pen, you don't have         paper…… if you have  both, no one calls.
7)         Irrespective of the direction of the wind, the smoke from the cigarette will always tend to      go to the non-smoker
8)         Since Light travels faster than Sound, people appear brighter before you hear them speak

Saturday 23 April 2011

ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి జ్వరంతో హాస్పిటల్ కి వెళ్తే అతని రెండు కిడ్నీ లు తీసేశారు.


రాహుల్ అనే కర్షక్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధి జ్వరంతో హాస్పిటల్  29.10.2006 తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని ఒక పేరు మోసిన హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.  డాక్టర్లు కండిషన్ సీరియస్ అని చెప్పి అతన్ని  I.C.U.   లో ఉంచి మొత్తం అన్ని వైపులా మూసేశారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు.


రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్ తన తండ్రిని పిలిచి, "డాక్టర్లు తన కిడ్నీలు తీసేయడం గురించి మాట్లాడుకుంటున్నారు" అని చెప్పాడు. కానీ పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళ నాన్న అది నమ్మలేదు. కొడుకు భయపడి అలా చెప్తున్నాడు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు.


కానీ ఆ రాత్రే ఆ అబ్బాయి రెండు కిడ్నీలు తీసేసి అతన్ని చంపేశారు.


మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకున్న విద్యార్దులు చాలా తీవ్రంగా స్పందించారు.  వారిని లోపలికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకునేసరికి ప్రెస్ ని టి.వి. చానల్స్ వారిని పిలిపించేసరికి, అప్పుడు ఆ విద్యార్దులను లోపలికి పోనిచ్చారు.


వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి కిడ్నీలు ఉండాల్సిన చోట కుట్లు వేసి ఉన్నాయి. రెండు కిడ్నీలు తీసేసినట్టు అందరికి అర్దమైంది.


కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ అబ్బాయి బంధువు ఒకడికి డబ్బు ఆశ చూపించి అతన్ని లొంగతీసుకున్నారు.  దురాశాపరుడైన అతను వారికి దాసోహమైపోయి ఆధారాలేవీ లేకుండా ఆ అబ్బాయి శవాన్ని తీసుకెళ్ళి కాల్చేశాడు.  ఆ అబ్బాయి కుటుంబం మొత్తం షాక్ లో ఉండడం వల్ల వారు ఏమీ చెయ్యలేకపోయారు.


కొందరు దుర్మార్గుల వల్ల ఒక నిండుప్రాణం పోయింది.


మిత్రులారా, ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్లకు అందరికి చెప్పండి.  ఈ విధంగా మరో ప్రాణం పోకుండా కాపాడండి.


ఇది కూడా నిజంగా జరిగిన విషయమే. దీని లింక్ కింద ఇస్తున్నాను చదవండి.






మామిడి పండ్లు కొనే ముందు తస్మాత్ జాగ్రత్త.....

వ్యాపారస్తులు లాభాల కోసం మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి గాను, మామిడి పండ్ల మీద కార్బైడ్ అనే ఒక కెమికల్ చల్లి వాటిని కృత్రిమంగా  రంగు తెప్పిస్తున్నారు.  ఇలా కార్బైడ్ తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.  ఈ కార్బైడ్  తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల కడుపు నొప్పి, అతిసారం, వాంతులు, కడుపులో వికారంగా ఉండడం మొదలైన రోగాల బారిన పడాల్సి వస్తుంది.  


కొంచెం జాగ్రత్తగా కొనడం మంచిది.  కొంచెం పచ్చిగా ఉన్న కాయల్ని తీసుకుని మనమే బియ్యం డబ్బాలోనో లేకపోతే మరేదాంట్లోనో ఉంచి పండించుకోవడం మంచిది.


ఆపిల్ పండ్లు మరి కొన్ని పండ్లు మెరవడానికి వాటి మీద మైనం వేస్తున్నారట.  అలాగే పుచ్చకాయలు తియ్యగా ఉండడానికి "సచ్చారిన్" అనే కెమికల్ కలుపుతున్నారట. .... 


కాబట్టి, మిత్రులారా ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే....... ఏమీ లేదు.... నాకు తెలిసిందంతా చెప్పేసాను.  మన కుటుంబాల గురించి మనమే శ్రద్ద తీసుకోవాలి కాబట్టి....... కొనేముందు మంచివి చూసి కొనండి....

ఒక చిట్టి పాప ప్రాణాన్ని బలి తీసుకున్న సెల్ ఫోన్....


ఇది నేను ఎక్కడో చదివానండి.  అందరికి చెప్పడం మంచిది అనిపించింది. అందుకే అందరితో పంచుకుంటున్నాను.


ఒక హాస్పిటల్ లో ఒక చిన్నారి పాపకు ఏదో ఆపరేషన్ జరుగుతోంది. ఒక యంత్రం ద్వారా ఆపరేషన్ జరుగుతోంది. డాక్టర్స్ అందరు చాలా అప్రమత్తంగా ఉద్విగ్నంగా ఉన్నారు.  అది చాలా క్రిటికల్ కేస్.  ఆపరేషన్ కీలకమైన దశకు చేరుకుంది.  ఉన్నట్లుండి ఆ యంత్రం బీప్ బీప్ అని ఎవరో ఆపినట్టు గా ఆగిపోయింది.  ఆ డాక్టర్స్ కి ఒక్క క్షణం ఏమీ అర్దం కాలేదు.  అంతలోనే తేరుకుని, ఎవరో ఆపరేషన్ చేస్తున్న గది బయట సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు గుర్తించి, బయటకు పరుగెత్తి ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి, మళ్ళీ ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చేసరికే ఆ పాప ప్రాణం పోయింది.  ఆపరేషన్ థియేటర్ బయట సెల్ ఫోన్ వాడడం వల్ల దాని నుంచి వచ్చిన రేడియేషన్ ప్రభావం వల్ల ఆ యంత్రం పనిచేయడం ఆగిపోయింది.  కేవలం దాని వల్ల ఒక చిన్నారి ప్రాణం పోయింది.

మిత్రులారా, హాస్పిటల్స్ లో గాని, పెట్రోల్ బంక్ ల దగ్గర కాని, విమానంలో కాని.... దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.  ఎవరైనా మాట్లాడుతున్నా కూడా, వారికి నచ్చచెప్పి వారి సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయించండి. రేడియేషన్ బారి నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి. దయచేసి అందరు సహకరించండి.

Thursday 21 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 1


ప్రియతమా నీవెక్కడ...?...... పార్ట్ 1

                        "ప్రేమ...."

              ఈ రెండక్షరాలే రెండు హృదయాల కలయికతో ముడిపడిన రెండు జీవితాలు కడదాకా సాగించే ప్రయాణానికి ఆధారం.
               ప్రతి స్త్రీ తనకు కాబోయే భర్త తనకు మంచిస్నేహితుడవ్వాలని కోరుకుంటుంది.  అలాగే, ప్రతి యువకుడు కూడా తనకు కాబోయే అమ్మాయి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలిగిఉంటాడు.  భార్య మనసును అర్ధం చేసుకోలేని మగవాడు మంచిభర్త కాలేడు.  పురుషుడి హృదయం స్త్రీలా మెత్తనైనది.  స్త్రీ హృదయం పురుషుడిలా కఠినమైనది అని ఓ మహానుభావుడు చెప్పాడు...."
               అతని ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది.
               "పదండి వెళ్లిపోదాం" అంది చందన.
               స్పీచ్ బానే ఉంది గా.  అప్పుడే వెళ్ళిపోదామంటున్నావేం.  మీ అమ్మాయిల మనసులు కఠినంగా ఉంటాయి అనేసరికి కోపం వచ్చిందా... నవ్వుతూ అడిగాడు కుమార్.
               అదేం లేదండీ అంది చందన.
               వాళ్ళిద్దరు భార్యాభర్తలు.  కుమార్ సాఫ్ట్‍వేర్ ఇంజనీర్.  చందన "మాధవి కాన్సర్ ట్రస్ట్" కి ఛైర్మన్.
               ఆ చర్చ జరిగుతున్న ఆడిటోరియం నుండి బయటికి వచ్చి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ పార్క్ వైపు నడిచారు.
               చందనా! అటు చూడు.  జైలు నుండి పారిపోయి వచ్చినట్లున్నాడు కదూ.  బహుశా టెర్రరిస్టేమో నవ్వుతూ అన్నాడు కుమార్.  భర్త మాటలకు యధాలాపంగా అటుకేసి చూసింది చందన.  మాసిన బట్టలు, తైలసంస్కారం లేక రేగిన జుట్టు, అసహ్యంగా కనిపిస్తున్న గడ్డంతో భయంకరంగా ఉన్నాడతను. అతన్ని చూసి ఒక్క క్షణం షాక్ కి గురై వెంటనే తేరుకుని, "కార్తీక్" అని గట్టిగా కేక పెట్టి అతని వైపు పరిగెత్తింది.
               కుమార్ కి ఏమీ అర్దం కాలేదు.  అయోమయం గా ఆమెని అనుసరించాడు "ఏమైంది చందూ,  ఏమైంది అంటూ"
               కార్తీక్ ఎలా ఉన్నావు.  ఎక్కడ ఉన్నావు. అసలు ఇన్ని రోజులు ఏమై పోయావు.. ఉబుకుతున్న కన్నీటిని అదుపుచేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ  ఒక రకమైన ఉద్వేగంతో అడిగింది చందన.
               విస్మయంగా వారిద్దరికేసే చూస్తున్నాడు కుమార్.
               భావరహితంగా ఆమె వైపు చూసి నిర్లిప్తంగా నవ్వాడతను.  కళ్ళు రెండూ లోపలికి పీక్కుపోయి నేడో రేపో పోయేలా ఉన్నాడతను.

              నన్ను "మధు" దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళవా..? నెమ్మదిగా గొంతు పెగిల్చాడు కార్తీక్.
               మధు దగ్గరికా..? ఆమె కంఠం రుద్దమైంది.
              ప్లీజ్.. ఇదే చివరిసారి.  నన్ను తీసుకెళ్ళు.  అతని కంఠంలో ఆజ్ఞ లాంటి అభ్యర్దన ఉంది.
               ఆమె కళ్ళల్లోంచి కన్నీరు ధారలు గా కారుతుండగా,  గత్యంతరం లేక కుమార్ దగ్గరికొచ్చి "ఏమండీ మన కారు ఇక్కడికి తీసుకురండి" అని చెప్పింది.
               అదికాదు చందనా, అతనెవరో ఏమో, నువ్విలా... అతనింకా ఏదో చెప్పబోతూంటే వారించి, ప్లీజ్ అండీ మీకు అంతా తర్వాత వివరంగా చెబుతాను.  ముందు కారు తీసుకురండి అంది.
               అన్యమస్కంగానే కారు తీసుకు వచ్చాడు.  కార్తీక్ ని జాగ్రత్తగా కారు బాక్ సీట్ లో పడుకోబెట్టారు. 
               డ్రైవింగ్ సీట్ లో కూర్చుని చందనే డ్రైవింగ్ చెయ్యసాగింది. 
              "ఎక్కడికెళ్తున్నాం చందూ" అడిగాడు కుమార్.
               ఆమె ఏదో దీర్ఝాలోచనలో ఉంది.  కారు "హిందూ స్మశాన వాటిక" లోకి ప్రవేశించింది. 
               ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అడిగాడు కుమార్ ఒకింత అసహనంతో.
               చెమర్చిన కళ్ళతో "మాధవి ఉండేది ఇక్కడే " చెప్పింది చందన.  నిశ్చేష్టుడైపోయాడు కుమార్.

                                                                                                        (ఇంకా ఉంది).....




రెండు భారత్‌లు ఉండరాదు !


దేశంలో ఆకలి చావులు సంభవిస్తుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. 'మీకు రెండు భారత్‌లు ఉండబోవు. పౌష్టికాహార లోపం నిర్మూలనకు సంబంధించి మన మొత్తం వైఖరిలో ఈ మొరటు వైరుధ్యాలేమిటి? దేశంలో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అంతం చేయాలి' అని దల్వీర్‌ భండారీ, దీపక్‌ వర్మతో కూడిన అత్యున్నత ధర్మాసనం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌కు సూచించింది. 'ఓవైపు సంపన్నులు, మరోవైపు ఆకలి చావులు' ఒకే దేశంలో ఈ అంతరాలు ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'మన దేశం సంపన్నంగా మారుతోందని మీరే అంటున్నారు. అదే సమయంలో దేశంలో ఆకలి చావులూ సంభవిస్తున్నాయి. ఏమిటీ వైరుధ్యం?' అని ప్రశ్నించింది. దేశంలో మిగులు ఆహార ధాన్యాలున్నాయని చెబుతున్న సమయంలోనే ఆకలి చావులూ సంభవిస్తుండటంపై వ్యాఖ్యానిస్తూ 'ధనిక - పేద అని దేశాన్ని రెండుగా విభజించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పేదరికాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న అర్హతా ప్రమాణాలను న్యాయమూర్తులు తప్పుబట్టారు. 'దేశంలో పంటలు బాగా పండాయని, గోదాములు పూర్తి నిల్వలతో వున్నాయని వింటున్నాం. ఇది సంతోషకరమైన పరిస్థితి అనడంలో సందేహం లేదు. అయితే ప్రజలకు ప్రయోజనం కలిగించని ఈ అంశాలతో ఉపయోగం ఏమిటి? ఓ వైపు గోదాములు సమృద్ధిగా ఉండగా, మరోవైపు ప్రజలు ఆకలితో మాడుతు న్నారు' అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రణాళికా సంఘాన్ని ఉద్ధేశించి 'పోషకాహార లోపం క్రమంగా పెరుగుతోంది. మీరేమో దేశంలో 36 శాతం మంది మాత్రమే పేదరిక రేఖకు దిగువన వున్నారంటున్నారు. 2011లో కూడా మీరు 1991 నాటి లెక్కలనే అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే ప్రణాళికా సంఘం లెక్కలతో విభేదిస్తూ అఫిడవిట్లు సమర్పిస్తున్నాయి. పేదలు ఎక్కువగా వున్నారని, తాము ప్రణాళికా సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని రాష్ట్రాలు చెబుతున్నాయి. పేదరి కాన్ని నిర్ధారించేందుకు పట్టణ ప్రాంతాల్లో రోజుకు రు.20, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రు.11ల ఆదాయాన్ని మీరు నిర్ణయించారు. ఈ నామమాత్రపు ఆదాయ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా సమర్ధించుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజు జీవనానికి ఇది సరిపోదే..!? దీనిపై ప్రణాళికా సంఘం వివరణ ఇవ్వాలి' అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్‌) ఉన్న కుటుంబాల అర్హతను నిర్ణయించే విషయంలో కేంద్రం, ప్రణాళికా సంఘాలను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. ఈ అర్హతను నిర్ణయించడంలో వున్న వైరుధ్యాలపై వారంలోగా తనకు అఫిడవిట్‌ సమర్పించాలని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ను సుప్రీం ఆదేశించింది.

నవ్వుల జల్లు


అదేంటిరా...?
రవి: అరే సురేష్‌! 'ఐయామ్‌ గోయింగ్‌' అంటే అర్థం చెప్పరా?
సురేష్‌: 'నే వెళుతున్నా!'
రవి: అదేంటిరా? ఒక్క ఇంగ్లీషు వాక్యానికి అర్థం చెప్పమని అడిగితే నే వెళుతున్నా అంటావేంటిరా? ఎంత నీకు ఇంగ్లీషు వస్తే మాత్రం మరీ అంత ఇది పనికిరాదురా? నాలాంటి తెలియనవాళ్లకు చెప్పాలి కదరా?
సురేష్‌: ఆఁ.......!

దీపం కదా.!
సుబ్బారావు: ఏంటిరా? కరెంటు పోయినా చీకట్లోనే ఉన్నారు. దీపమన్నా వెలిగించుకోకుండా?
రామారావు: మా ఆవిడ చదువుకుంటోందిరా!
సుబ్బారావు : అయితే తప్పకుండా వెలిగించాలిగా మరి..?!
రామారావు: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కదరా!
సుబ్బారావు : ఆఁ.......!

రేపే ధరిత్రి దినోత్సవం... మన భూమాతను రక్షించుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 22న 'ధరిత్రి దినోత్సవం' జరుపుకుంటు న్నారు. భూమి.. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. మొదట ఐరాస 1969, మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌నెల్సన్‌ ప్రారంభిం చారు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమిది. ఆ తర్వాత 1970 ఏప్రిల్‌ 22న అమె రికా తమ దేశంలో మొదటిసారి జరుపుకుంది. ఇక అప్పటి నుండి ఆ తేదీ ఖరారైంది. ఏదేమైనా నేడు భూమికి, పర్యా వరణానికి ముప్పు ముంచుకొచ్చింది. రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో అన్నిదేశాలు చిత్తశుద్ధితో ముం దుకురావాలి. అప్పుడే అందరికీ నిజమైన 'ధరిత్రి దినోత్సవం'.

Wednesday 20 April 2011

ఇంద్రవెల్లి గాయానికి మూడు దశాబ్దాలు


ఇంద్రవెల్లి గాయానికి మూడు దశాబ్దాలు

  • అడవి బిడ్డల గుండెల్లో చెరగని ముద్ర
  • అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీిలు
  • మారని జీవన ప్రమాణాలు
  • నేడు ఇంద్రవెల్లి మృతవీరుల సంస్మరణ దినం
ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలు రక్తం చిందించి మూడు దశాబ్దాలయ్యాయి. 1981 ఏప్రిల్‌ 20న తుడుంమోతకు తరలివచ్చిన ఆదివాసులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకీ తూటాలకు అడవి బిడ్డలు అమరులై ఈనెల 20వతేదీ బుధవారం నాటికి 30 ఏళ్లు గడిచాయి. అడవి బిడ్డలు చిందించిన రక్తం తడి ఇంకా ఆరనేలేదు. ఇంద్రవెల్లి పోరు అడవి బిడ్డల్లో పోరాటతత్వాన్ని పెంచింది. గతంలోకి ఒక్కసారి తొంగిచూస్తే ముప్ఫై ఏళ్ల క్రితం ఆదివాసులు బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్న రోజులు.. రెండు కాళ్ల ఆధునిక మృగాల తాకిడికి అడవి అడవంతా అల్లాడింది.. 

దళారులు.. వ్యాపారులు, అటవీ అధికారులు, పోలీసుల చేతిలో ఆదివాసుల బతుకులు దోపిడీ, పీడనకు గురయ్యాయి. అడవిలో ఆకుల దోపిడి.. అడవి సంపద దోపిడి.. ఆఖరికి అడవిలో వీచే గాలి సైతం దోపిడీనే.. అడవి బిడ్డలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. చిట్టడవులు చీకట్లో చిక్కి శల్యమయ్యాయి. అడవి ఒడిలో అభివృద్ధి అనేది కనుచూపులో కనబడలేదు. అక్కడంతా చీకటి. దళారుల దోపిడీ.. అక్కడ అమాయకులను బాదుతున్న పోలీసు లాఠీలు.. గిరిజనులు నోరు విప్పితే చాలు చావబాదే రోజులు.. అడవి బిడ్డలు ఆత్మరక్షణ కోసం నడుం బిగించక తప్పని పరిస్థితి. ఆ తరుణంలోనే అటవీ గ్రామాల్లో అన్నలు రంగ ప్రవేశం చేశారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదిరించారు. గిరిజనుల గుండెల్లో చోటుసంపాదించారు. గూడాల్లో స్థానం పొందారు.
ఫలితంగా గిరిజన గ్రామాల్లో బూట్ల చప్పుడు ప్రారంభమైంది. పోలీసుల అరాచకత్వాలకు బలవుతున్న గిరిజనులను అన్నలు తట్టిలేపారు. చైతన్యాన్ని రగిల్చారు. అడవి బిడ్డలు అన్నలతో జతకట్టారు. వారితో కలిసి తుడుం మోగించారు. అన్యాయాన్ని ఎదురించారు. తమకు జరుగుతున్న అన్యాయాలు పట్టిపీడిస్తున్న భూమి సమస్యను పరిష్కరించడం కోసం గిరిజనులు అన్నల సహాయంతో పథకాన్ని రూపొందించుకున్నారు. అన్నల అండతో అణగారిన జాతి అగ్గై లేచింది. అడవుల్లో ఖాళీగా ఉన్న భూములలో పోడుసాగు ప్రారంభించారు. అప్పుడే అడవుల్లో అలజడి మొదలైంది. తమ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు.



నక్సల్స్‌ అనుబంధ సంస్థ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్‌ 20న బహిరంగ సభ నిర్వహించడానికి గ్రామాల్లో తుడుం మోగించి ప్రచారం చేశారు. ఆనాడు 1981 ఏప్రిల్‌ 20న నాలుగు దిక్కుల నుంచి ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా ఆదివాసులు ఇంద్రవెల్లి చేరుకున్నారు. వేలాది మంది ఇంద్రవెల్లి చేరుకోవడంతో ఇంద్రవెల్లి జనసంద్రమైంది. గిరిజనులు ఇంద్రవెల్లికి రాకుండా పోలీసులు విఫలయత్నం చేశారు. జనాన్ని చూసి పోలీసు గుండెలు అదిరిపోయాయి. పోలీసుల చేతిలో తుపాకులు, గిరిజనుల చేతిలో ఆయుధాలు ''నువ్వా... నేనా'' అన్నట్లు ఉన్నాయి. ఆ రోజు ఇంద్రవెల్లి సంతకు వచ్చిన జనం మరోవైపు సభ కోసం వచ్చిన వేలాది మందితో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోయారు. సభాస్థలికి చేరుకోవడానికి ఊరేగింపు ప్రారంభమైంది. వేలాది మంది చేస్తున్న నినాదాలతో ఇంద్రవెల్లి దద్దరిల్లిపోయింది. అదే గుంపులో ఓ గిరిజన మహిళకు పోలీసుకీ మధ్య మాటామాటా పెరిగింది. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి పోలీసుల ఆయుధ ప్రయోగం చేసింది. పోలీసు నేలకొరిగాడు. పరిస్థితి అదుపు తప్పి కాల్పులకు దారితీసింది.




ఆదిలాబాద్‌ ఆర్డీఓ కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పోలీసులు కాల్పులు ప్రారంభించి పిట్టలను కాల్చినట్లు ఆదివాసులను కాల్చారు. కరుడుగట్టిన మేఘాలు తీర్చలేని ధరణి మాత దాహాన్ని గోండుల రక్తం తీర్చింది. అప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
అనధికార లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. పోలీసు కాల్పులకు కాళ్లు, చేతులు పోగొట్టుకున్న గిరిజనులెందరో నేటికి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన గిరిజనుల స్మారకార్థం రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో స్థూపాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని డైనమైట్లతో పేల్చి నేలమట్టం చేశారు. స్థూపాన్ని కూల్చడంతో గిరిజనుల్లో నిరాశ నిస్పృహలు పెరిగాయి. అన్నలకు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లంపల్లి సంఘటన జరిగింది. గిరిజనుల్లో నెలకొని ఉన్న నిరాశను గమనించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. అడవిబిడ్డలు చిందించిన రక్తపు మరకలు ఇంకా చెదిరిపోలేదు. అడవి తల్లి ఇంకా మౌనంగా రోదిస్తూనే ఉంది. ఇంద్రవెల్లి సంఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గిరిజనుల సంక్షేమానికి పాలకవర్గాలు పెద్దపీట వేశాయి. ఇంద్రవెల్లి సంఘటన గిరిజనుల్లో పోరాట తత్వాన్ని మరింత బలోపేతం చేసింది. అనేక పోరాటాలకు సన్నద్ధం చేసింది.


గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతియేటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఆనాడు అధోగతికి ఆనవాళ్లుగా ఉన్న గిరిజన గ్రామాల్లో కొంత అభివృధ్ధి కనిపించినా జీవన ప్రమాణాల్లో మార్పులు రాలేదు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడు కరువై.. బతుకు బరువై అడవి బిడ్డలు అల్లాడుతూనే ఉన్నారు. తాగునీరు, వైద్యం ఇంకా వారికి అందడం లేదు. ఊరూరూ చెట్టుకొకటి.. గుట్టకొకటి రక్షిత నీటి పథకాలు నిర్మించినా గిరిజనులకు చుక్కనీరు అందడం లేదు. కలుషిత నీరు ఆదివాసుల ప్రాణాలను హరించేస్తోంది. వైద్యం అందక యేటా వందలాది మంది మరణిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. గిరిజనుల వ్యవసాయం అటకెక్కింది. గిరిజనుల భూములకనుగుణంగా సాగునీటి వనరులు పెంపొందించడానికి నిర్మించిన చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. చెరువుల నిర్మాణంలో గిరిజనుల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కంట్రాక్టర్ల ప్రయోజనాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని నిర్మించడంతో చెరువుల నిండా నీరున్నా అవి చేలకందని పరిస్థితి నెలకొంది. పౌష్ఠికాహార లోపం కారణంగా రక్తహీనత ఏర్పడి జీవచ్ఛవాలుగా మారి రోగాల బారిన పడి ఆదివాసులు అడవిసాక్షిగా ప్రాణాలు విడుస్తున్నారు.
గిరిజన మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాయకష్టం చేసే ఆదివాసి మహిళలు రక్తహీనతతో చావుకు చేరువవుతున్నారు. గిరిజనుల జీవన విధానం ఇలా ఉంటే ముప్పై ఏళ్లక్రితం గిరిజనుల్లో ఉన్న చైతన్యం ఇప్పుడు అనేకరెట్లు పేరిగింది. పోరాట మనస్తత్వం గల ఆదివాసులలో సామాజిక చైతన్యం స్పష్టంగా కనబడుతోంది. రోడ్డు సైడు గ్రామాల పరిస్థితిని చూసి గిరిజనులు అభివృద్ధి చెందారంటే పప్పులో కాలేసినట్లే. మారుమూల గ్రామాల్లో గిరిజనుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. అటవీ హక్కుల చట్టంతో అటవీ భూములు గిరిజనుల హస్తగతం కావడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. అటవీ భూములపై హక్కులు రావడం గిరిజనుల త్యాగఫలితమేనని ఆదివాసులు నమ్ముతున్నారు. 

గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు భారీగానే కృషి జరుగుతున్నప్పటికీ ఉన్నత చదువులకు ఆదివాసీ యువతీ యువకులు ఇంకా దూరంగానే ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పడం వల్ల గిరిజన బాలబాలికలు చదువుపై ఆసక్తి కనబరుస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఆదివాసీ యువతీ యువకుల్లో సామాజిక చైతన్యం పెల్లుబుకుతోంది. ఆశ్రమ పాఠశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటుచేయడంతో గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. వైద్యారంగం ఇంతవరకు మెరుగుపడలేదు. సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ గిరిజనులకు సకాలంలో మందులు దొరకడం లేదు. ఇప్పటి మారుమూల ప్రజల గ్రామాల్లో సంవత్సరాంతం వ్యాధులు అడవిబిడ్డలను వేధిస్తూనే ఉన్నాయి. గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నా ఇంకా దోపిడీ, పీడన కొనసాగుతూనే ఉన్నాయి. అమాయక గిరిజనులు ఇంకా దోపిడీకి గురవుతూనే ఉన్నారు.


ఇంద్రవెల్లి క్షతగాత్రుల దీనగాథలు

ఇంద్రవెల్లి మారణహోమం జరిగి మూడు దశాబ్దాలు గడిచినా ఆ గాయం ఇంకా మానలేదు. ఇంద్రవెల్లి కాల్పుల్లో క్షతగాత్రులైన వారి బతుకులు నేటికీ దుర్భరంగానే ఉన్నాయి. పోలీసుల తూటాలకు బలైన వారి కుటుంబాలకు ఇప్పటికీ ఎలాంటి సహాయం అందకపోగా క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇంద్రవెల్లి క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినా దాన్ని అమలు చేయలేదు. అడవి బిడ్డల త్యాగాలు వృథా పోవని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని బాసలు చేసిన వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. 

ఇంద్రవెల్లి కాల్పుల్లో పోలీసు తూటాకు గాయపడ్డ కినక మాన్కుబాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో గాయపడ్డ భీంరావు పోలీసు తూటాలకు కాలు పోగొట్టుకుని భయకంపితుడై స్వగ్రామం విడిచిపెట్టి ఉట్నూర్‌కు సమీపంలోని వంకతుమ్మ గ్రామంలో నివసిస్తున్నాడు. మడావి జంగుబాయి, ఆమె భర్త శంభు ఇంద్రవెల్లి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారు.
వైద్యమందక మడావి జంగుబాయి, భర్త శంభు అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటన ఇప్పటికీ గిరిజనుల హృదయాలను కలిచివేస్తోంది. భర్త చనిపోయిన తరువాత ఆమె బతుకుదెరువు కోసం కన్నాపూర్‌ గ్రామానికి వెళ్లిపోయింది. అడవే ఆధారంగా జీవిస్తోంది. హెర్మ దేవరావు అనే గిరిజనుడు భుజానికి తూటా తగలడంతో వైద్యమందక మరణించగా ఆయన భార్య మానుబాయి, కొడుకు లింగుతో కలిసి దేశాంతరాలు వెళ్లిపోయింది. ఏప్రిల్‌ వచ్చిందంటే క్షతగాత్రుల కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలు ఆనాటి సంఘటనను జ్ఞాపకం తెచ్చుకొని కన్నీరు తెచ్చుకోవడం తప్ప వారికి మరే మార్గం లేదు. ఇంద్రవెల్లి మండలంలోని ఓల్‌మద్రి గ్రామానికి చెందిన సెడ్మకి కొద్దు ఇంద్రవెల్లి కాల్పుల్లో అసువులు బాయగా ఆయన కుటుంబం దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆయన కొడుకు మహంతిరావు, భార్య లక్ష్మీబాయి కోయల్‌పాండ్రి, తాటిగూడ గ్రామాల్లో నివసిస్తున్నారు.


ఇంద్రవెల్లి సంఘటనలో అమరులైన త్యాగజీవులందరికి.... నా సుమాంజలి..

Monday 18 April 2011

ఎవరు పేదవారు, ఎవరు లేనివారు.... ఇది చదివి మీరే చెప్పండి


ఎవరు పేదవారు, ఎవరు లేనివారు.... ఇది చదివి మీరే చెప్పండి.




ఒక సంపన్నుడైన ఒక వ్యక్తి తన కొడుకుని తీసుకుని ఒక పల్లెటూరికి వెళ్ళాడు.
పేదరికం అంటే ఎలా ఉంటుందో, పేదరికంలో ఎలా బ్రతుకుతారో చూపెట్టడం అతని ఉద్దేశ్యం.
ఊరిబయట ఒక పొలంలో రెండు పగళ్ళు, రెండు రాత్రుళ్ళు ఉన్నారు.  ఒక పేద జంట అక్కడే కాపురం ఉంటోంది ఆ పొలంలోనే పని చేసుకుంటూ.


తిరిగి వచ్చేటపుడు తండ్రి కొడుకును అడిగాడు ఎలాఉంది ఇక్కడికి రావడం అని..


ఆ కొడుకు "చాలా చాలా బాగుంది నాన్నా" అని బదులిచ్చాడు.


పేదవాళ్ళు పేదరికంలో ఎలా బ్రతుకుతారో చూశావా.... అడిగాడు తండ్రి.


"చూశాను నాన్నా" చెప్పాడు కొడుకు.


"అయితే దీని వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు" అడిగాడు తండ్రి.


కొడుకు ఇలా చెప్పాడు....


మనకు ఒకేఒక కుక్క ఉంది.... వాళ్లకు నాలుగున్నాయి.
మన గార్డెన్ మధ్యలో చిన్న స్విమ్మింగ్‍పూల్ ఉంది.  వాళ్లకైతే కళ్ళు చూసినంత దూరం పెద్ద నది ఉంది.
మనం రాత్రిళ్ళు మన తోటలో చిన్న చిన్న దీపాలు వెలిగించుకుంటాం.  వాళ్లకి రాత్రిళ్లు ఆకాశంలో లెక్కలేనన్ని చుక్కలను వెలిగించుకుంటారు.
మనకు కొంచెం భూమి మాత్రమే ఉంది బ్రతకడానికి. వాళ్ళకి అంతులేనంత భూమి ఉంది.
మనం వేరేవాళ్ళ ద్వారా సహాయం పొందేస్తితిలో ఉన్నాం.  కాని వాళ్ళు ఇంకొకరికి సహాయం చేస్తున్నారు.
మనం మన తిండి కొనుక్కొని తింటున్నాం.  వాళ్ళు కష్టపడి పండించుకుని మనకు కూడా పెడుతున్నారు.
మనం మనల్ని కాపాడడానికి మన ఇంటి చుట్టూ గోడ కట్టుకున్నాం.   కానీ వాళ్ళ చుట్టూ వారికోసం ప్రాణమిచ్చే స్నేహితులున్నారు.
మనదగ్గర ఉన్నది ఎవరు దోచుకుపోతారో అని మనం క్షణక్షణం నరకంలా భయపడుతూ బ్రతుకుతున్నాం.  వాళ్ళు ఎటువంటి భయాలు లేకుండా ప్రతిక్షణం సంతోషంగా నవ్వుతూ గడుపుతున్నారు.
.........


ఆ తండ్రికి మాటలు రాక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు..... కొడుకు మాటల్లోని వాస్తవాలకు.


మనం ఎంత పేదరికంలో ఉన్నమో తెలియజేసినందుకు థాంక్స్ నాన్నా...అన్నాడు కొడుకు.




మనదగ్గర లేని వాటి వాటి గురించి బాధ పడకుండా, మన దగ్గర ఉన్నవాటితో సంతృప్తి గా బ్రతకడమే మేలు.

Friday 15 April 2011

మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా?....లేక అసలు పెళ్ళే ఇష్టం లేదా?...

(చదవండి.. తలా తోకా లేనిదని అన్యదా భావించకుండా మీ అభిప్రాయం చెప్పండి...)



"మీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదా?....లేక అసలు పెళ్ళే ఇష్టం లేదా?..."


రెండూ


అంటే ఎవరినైనా ప్రేమించారా?


మీకు తెలీదా?


అంటే మీరు నన్నింకా ప్రేమిస్తున్నారా?  మీ మనసులో నేనింకా ఉన్నానా?


ఇంకా బ్రతికే ఉన్నవా? అని అడుగుతున్నారు మీరు.  ఆ విషయం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం అనవసరం.  దాని వల్ల లాభాల కన్నా అనర్దాలే ఎక్కువ.


గుర్తు తెచ్చుకోవడం మనకవసరం లేకపోయినా మన చుట్టూ ఉన్న సమాజానికి అవసరం.


కావచ్చు.


నువ్వు పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం నేనే అంటున్నారు.  నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమే కారణం అంటున్నారు.  ప్లీజ్ మీరు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోండి.


చూడండి! నాపెళ్ళి అనేది  నాకు మాత్రమే సంబంధించిన విషయం.  నా పెళ్ళి నాకోసమే చేసుకుంటాను.అంతేకాని, వేరే ఎవ్వరి కోసం కాదు.  మనసులో ఒక అమ్మాయి ని ఉంచుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నాకిష్టం లేదు.  ఈ విషయం లో నిర్ణయం తీసుకునే అధికారం నాకుందనుకుంటాను.....


నేను చెప్పినా వినరా?


మీరు కాబట్టే ఇంకా ఇంతసేపు మాట్లాడుతున్నాను.  అయినా నాకు మీరంటే ఉండే ఇష్టం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.  మిమ్మల్ని ఇష్టపడి, మళ్ళీ వేరొకరిని ఇష్టపడితే అది ప్రేమ అనింపించుకోదు.


మీ నిర్ణయం మార్చుకోలేరా?


మాటిమాటికి మార్చుకునేది నిర్ణయం అవదు. అయినా నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని మార్చుకోను.ఒక విషయం... జీవితంలో ఎవరైనా ఒక్కరి ని మాత్రమే నిజంగా ప్రేమించగలరు. దయ చేసి వెళ్ళిపొండి.  మళ్ళీ నాకు కనబడకుండా వెళ్ళిపొండి.







ఒక కన్నీటి చుక్క కను చివరనుండి చెక్కిలి మీదకు జారి నాతో ఇలా అన్నది.....


ఒక కన్నీటి చుక్క కను చివరనుండి చెక్కిలి మీదకు జారి నాతో ఇలా అన్నది.....


"ప్రియతమా! ఇన్నాళ్ళూ నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయాను. 
ఎన్నో అనుభవాల్ని నీతో పంచుకుంటూ వచ్చాను.  విషాదమైనా, ఆనందం మరీ ఎక్కువైనా
బయటకు రావడానికి ప్రయత్నించాను.  కానీ నిన్ను వదలి మాత్రం వెళ్లలేకపోయాను. 
 స్నేహితుడా!  ఈ రోజు నీ గుండెల్లో ఉబుకుతున్న ఈ వేదన్న తరంగం నన్ను కుదిపి వేస్తోంది. 
 బైటకు తోసేస్తోంది.  నేను కదిలి - కారి - జారి - ఆవిరై పోతాను.  
నేనలా వెళ్ళిపోవడం
 నీ మనసుకేమాతం ఊరటనిచ్చినా........ 


మిత్రమా...    నాకంతకన్నా కావల్సిందేమున్నది...!


(ఇది యండమూరి రాసిన వెన్నెల్లో ఆడపిల్ల లోనిది. నాకు బాగా నచ్చిన వాక్యాలు)

ఒక కన్నీటి చుక్క కను చివరనుండి చెక్కిలి మీదకు జారి నాతో ఇలా అన్నది.....


ఒక కన్నీటి చుక్క కను చివరనుండి చెక్కిలి మీదకు జారి నాతో ఇలా అన్నది.....


"ప్రియతమా! ఇన్నాళ్ళూ నేను నీ గుండె లోతుల్లో నిక్షిప్తమై ఉండిపోయాను. 
ఎన్నో అనుభవాల్ని నీతో పంచుకుంటూ వచ్చాను.  విషాదమైనా, ఆనందం మరీ ఎక్కువైనా
బయటకు రావడానికి ప్రయత్నించాను.  కానీ నిన్ను వదలి మాత్రం వెళ్లలేకపోయాను. 
 స్నేహితుడా!  ఈ రోజు నీ గుండెల్లో ఉబుకుతున్న ఈ వేదన్న తరంగం నన్ను కుదిపి వేస్తోంది. 
 బైటకు తోసేస్తోంది.  నేను కదిలి - కారి - జారి - ఆవిరై పోతాను.  
నేనలా వెళ్ళిపోవడం
 నీ మనసుకేమాతం ఊరటనిచ్చినా........ 


మిత్రమా...    నాకంతకన్నా కావల్సిందేమున్నది...!

అత్యంత దురదృష్టవంతుడు.....


అత్యంత దురదృష్టవంతుడు.....




భార్యకి గౌరవం ఇవ్వని, ఇవ్వలేని వాడు,


అమితమైన ఆనందం లోను, అంతులేని దు:ఖం లోను భార్యను 
తల్చుకోని వాడు,


పనిలోను, వ్యసనంలోను పడి,
భార్యను నిర్లక్ష్యం చేసే వాడు....


ఈ ప్రపంచం లో కెల్లా దురదృష్టవంతుడు.

Thursday 14 April 2011

నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా......?


నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా......?


ఎక్కడ నీలివర్ణపు మేఘాలు పవిత్రంగా...
చిరునవ్వులొలికిస్తూ... 
వర్షాక్షితల దీవెనలు కురిపిస్తాయో....


ఎక్కడ మమతల నునులేత కెరటాలు
తల్లిపాలకి మల్లే..
స్వచ్చంగా పొంగిపొర్లుతాయో...


ఎక్కడ పావురాళ్ళ రెక్కల నీడల్లో..
మనిషి ప్రశాంతంగా బ్రతుకగలడో...


అక్కడ.....


అక్కడే...ఉంటుంది..... నిజమైన 
అనుభవైకవేద్యమైన.... ఆనందానికి నిర్వచనం.

మిత్రులకు విజ్ఞప్తి.. సైనా నెహ్వాల్.... దేశానికి గర్వకారణం.... కానీ... ఆమెకు ఇస్తున్న ప్రోత్సాహం ఏ పాటిది?


సైనా నెహ్వాల్.... 


దేశానికి గర్వకారణం.... కానీ... ఆమెకు ఇస్తున్న ప్రోత్సాహం ఏ పాటిది?  చాలా తక్కువ. క్రికెటర్ల తో పోలిస్తే చాలా చాలా తక్కువ. సూపర్ సీరిస్ లు గెలిచి దేశానికి తిరిగి వస్తే కనీసం స్వాగతం చెప్పడానికి కూడా విమానాశ్రయం లో ఎవరూ లేరంటే.. మన బాడ్మింటన్ అసోసియేషన్ ఎందుకు అసలు. వరల్డ్ కప్ గెలిచినందుకు క్రికెట్ వీరులకు కోట్లు కోట్లు డబ్బు, కార్లు, బంగళాలు, రకరకాల ఆఫర్లు పోటీలు పడి మరీ ప్రకటిస్తూంటే.. మన సర్కారు మాత్రం కనీసం ఆమె ను అభినందిచాలి అన్న విషయం కూడా మరచి పోవడం చాలా బాధాకరం. చైనా క్రీడాకారిణులను ఓడించి దేశానికి వన్నె తెచ్చిన ఆమె ను విస్మరించడం గర్హనీయం.  




మిత్రులారా ఆమెకు మనం అందరం మన సంఘీభావం తెలియచేద్దాం రండి.  మన తోబుట్టువు సాధించిన విజయాలకు గర్విస్తూ మన సోదరికి అభినందనలు తెలియజేద్దాం. మీ అభినందనలు, మీ స్పందనలు తెలియజేయండి...


జయహో.... సైనా....... మరిన్ని కప్పులు గెలిచి దేశ మువ్వన్నెల పతాకాన్ని విను వీధిలో రెపరెపలాడేలా.. మరిన్ని విజయాలు సాధించు....


వందేమాతరం.....


Monday 11 April 2011

అమృతవాక్యాలు.....

మంచి చెడు అనేదేది లేదు. కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.


నీకు కనబడిందంతా నిజమని నమ్మకు. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి.


మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల. అత్యంత హీనమైన గుణం పగ. ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగ కోసం ఉపయోగించడం అనవసరం.


ఎక్కడైతే అసంతృప్తి ఉన్నదో అక్కడ ఆనందం ఉండదు. అసంతృప్తి అనేది మనిషి కి దేనివల్లనైనా రావచ్చు. అది తీరని కోరిక వల్ల కావచ్చు. తీరని కామము వల్ల కావచ్చు. తెగని క్రోధము వల్ల కావచ్చు... వాటిని  జయిస్తే జీవితమంతా తృప్తే ఉంటుంది.


ఇలా ఉండాలని నువ్వు అనుకుంటావు. కాని నిన్నెలా ఉంచాలో ఆ దేవుడు నిర్ణ ఇస్తాడు  

Friday 8 April 2011

ఒక చిట్టి పాప తను కాన్సర్ తో చనిపోయే చివరిక్షణాల్లో రాసుకున్న కవిత...


ఒక చిట్టి పాప తను కాన్సర్ తో చనిపోయే చివరిక్షణాల్లో రాసుకున్న కవిత ఇది. ఆ పాప చనిపోయిన చాలా కాలం తరువాత ఇది బయటపడిందట. దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి  మీతో పంచుకుంటున్నాను. ఆ చిట్టితల్లి ఆత్మ కి శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను.


ప్రియమైన అమ్మ కి,


అమ్మా...


        నన్ను నేల మీద పడుకోబెట్టినపుడు
        నా శరీరానికి స్నానం చేయించాల్సి వచ్చినపుడు...


        నీ కన్నీటిని అందుకోసం వాడకు.


        నన్ను తీసుకెళ్ళేటపుడు మాత్రం
        ఓ రెండు కన్నీటి చుక్కలు అర్పించు.


  బూడిదలోంచి నా అస్థికల్ని ఏరేటప్పుడు
        నీ హృదయం ముక్కలు కాకుండా చూసుకో.


        నీ వేళ్ళ సందుల్లోంచి జారే బూడిద
        నేలపైని దుమ్ములో కలిసినా....


    నా జ్ఞాపకం.......


          నీ హృదయంలో శాశ్వతమని తెలుసు.


    ఆ ఒక్క ఊహే...


          నా అంతిమయాత్రకి కళ్యాణిరాగంగా మిగుల్తోంది...

Thursday 7 April 2011

ఒరిస్సా లో పని చేస్తున్న కలెక్టర్ వినీల్ కృష్ణ గారి ఐ.ఎ.ఎస్. పరీక్ష ఇంటర్వ్యూ వివరాలు ...

Vineel Krishna : May I come in, sir.
GSJ: Yes, please come in.
VK: Thank You, Sir, and Good Afternoon to you all.
GSJ: Good Afternoon Mr. Vineel Krishna, Please be seated.
VK: Thank You sir.
GSJ: Mr. Vineel, I see that you are from IIT Madras. Did you not get any campus placement?
VK: Sir, I got placement as Systems Engineer in Wipro Technologies. But, I did not join the job.
GSJ: What is the reason?
VK: Sir, I had already chosen Civil services as my career. I wanted to have a single focus on the exam. If I had joined the job, neither would I have satisfied the job nor the exam. So, I did not join the job, sir.
GSJ: Why do you want to join the Civil Services?
VK: Sir, I want to be part of the developmental activities. I am also attracted by the challenging and diverse nature of the job. The opportunity provided to make a positive impact on the society, is unparalleled by any other job.
GSJ: But dont you think the scope of bureaucrats has reduced. Your friends must be in good jobs and some must have gone abroad. They must be doing well there. Why do you want to swim against the current?
VK: Sir, I am just listening to my inner voice, which says that this is the area where I must be and doing which I would realize my potential. Regarding the scope of bureaucrats, sir, I agree that there is reduction. But I feel that the govt. is finally concentrating on the core areas.
GSJ: Can You explain it?
VK: Sir, previously, the govt. expanded into unnecessary areas like running hotels, where its presence is not really required. Now, the govt. is focussing on the core areas like social sector- education, health, etc.
GSJ: I see that you played cricket. Are you still involved?
VK: No Sir, I used to play it during school and University days.
GSJ: Why are you not playing it now?
VK: Sir, I dont have the opportunity now. To play cricket we need a team and presently, I dont have one.
GSJ: So, you dont do anything for physical fitness?!
VK: Sir, I go for jogging every day and also I practice yoga and pranayama.
GSJ: Is it Art of Living or...
VK: Yes sir, I practice the Sudarshana Kriya of Art of Living.
GSJ: How much distance do you run every day?
VK: Well sir, I go to the ground and then decide upon the rounds and ensure that I complete it, come what may. Usually it is around 8-9 rounds sir, approx. 3-4 km.
GSJ: Interestingly, you worked as Sub-editor of a magazine. Can you explain this?
VK: Sir, I worked for this telugu youth magazine. It caters to the educational and career requirements of the rural youth sir. I was cotributing for their Science and technology section. Since I was following the current affairs part and since it also helps me in exam preparation, I joined the job.
GSJ: What is its circulation?
VK: It is around 12,000, sir.
GSJ: Mr. Vineel, you come from Hyderabad, which had been doing well in many areas and been constantly in news...
VK: Yes sir, the previous govt. under Chandrababu Naidu, had special focus on Hyderabad and developed it in many ways. There was expansion of the roads, improving the infrastructure like the MMTS, parks, water supply, sanitation. Also there was development of tourist locations. The IT sector was particularly developed e.g. the Cyber towers. Recently, the construction of international airport has also started.
GSJ: Is there any problem with respect to housing?
VK: Yes Sir, there is a problem, especially for the lower income group to find low cost accomodation. There has also been concerns regarding slum growth in recent times.
GSJ: What do you know about "Women empowerment"?
VK: Sir, Women empowerment is about providing the necessary tools to the women so that they can over come the discrimination against them. So that, they can stand on their own and realize their potential. It involves various dimensions like social empowerment, political empowerment and economic empowerment. There are various measures like providing education and job reservations, as done in our state, then providing legal frame work, say against dowry, sexual harassment etc, then providing inheritance right to property etc.
GSJ: You said discrimination, how?
VK: Sir, woman is subjected to discrimination right from the birth. In many families, there are no celebrations when a girl child is born. Then with respect to provision of nutritious food, the male child is given preference. Also, the education of girl is a lesser priority. Then, after puberty, the sole concern of the parents is to marry her off some how. The further education of girl is highly discouraged and she is not allowed to stand on her feet. She is made dependent forever and therefore, the discrimination continues lifelong.
GSJ: In fact the discrimination starts in the womb itself, you must have heard of female foeticide...
VK: Yes sir, unfortunately in many places they conduct pre-natal tests and the female foetus is killed.
GSJ: What do you know about womens reservation?
VK: Sir, there is a bill pending in the Parliament which provides for one-third reservation to the women in the Parliament and the State legislatures. But there is no consensus among the political parties.
GSJ: We have already provided for reservations in the PRIs. But there seems to be some problem...
VK: Yes sir, it has been observed that in many cases her husband or brother or relatives influence the woman member. There is a proxy rule.
1st member: Mr. Vineel, do you have any understanding about rural areas?
VK: Yes sir, I often go to my grand parents place.
1m: Where is it situated?
VK: Sir, it is a village near Tenali, near Vijayawada.
1m: Which geographical region does it fall under?
VK: Sir, it is in the central part of coastal Andhra.
1m: Can you name the geographical regions in AP and the cropping patterns?
VK: Sir, we have three regions, namely, telengana, coastal andhra and rayalseema. The coastal andhra grows mainly rice. The irrigation facilities are good and therefore, they have 2-3 crops per year. While, the Telengana and the Rayalseema regions are rainfed, depending on the monsoons and are in the rain shadow zone. The irrigation facilities are also less, so mainly there are some dry crops. In rayalseema, they grow groundnuts, and in Telengana, they grow Jowar and cotton.
1m: You said your parents live in Coastal...
VK: Excuse me sir, my father works in BHEL, its actually my grand parents who stay in village.
1m: Ok, so coastal area is affected by cyclones. How are they formed?
VK: Sir, the cyclones are weather disturbances formed in tropical seas like the Bay of Bengal. It forms when some conditions are fulfilled like continues availability of warm moist air, some low pressure, the influence of the upper air atmoshere etc.
1m: Which part of the year do they occur?
VK: Sir, during the oct-nov and also during May.
1m: Are you sure they occur in May?
VK: Sir, I remember that in 1991 they occurred during the month of May.
1m: What measures would you take for cyclone prevention?
VK: Sir, actually my B.tech project was in AP cyclone hazard mitigation project (APCHMP). In that we were using the GIS- Geographical information system, for cyclone warning and prevention of loss to life. The system is installed at all the coastal district head quarters. The network is integrated with the Indian Meteorological Department(IMD). The IMD gives information about the cyclone, its intensity and possible direction. Then, the district administration can get specific details of the villages that would be affected by storm surges. Immediately, evacuation orders can be given and suitable measures can be taken.
1m: What measures would you take as Head of the district?
vk: Sir, firstly the complete picture should be understood with the available information. The field level officials should be contacted and asked to take steps for evacuation to cyclone shelters. Then, the disciplined forces like police and the army should be alerted. Also, the state road transport buses should be kept ready. The health department should be prepared for any eventuality. In the long term, sir, the constructions along the coast should be regulated and proper standards should be maintained to withstand high wind speeds.
2member: Why is transparency in administration being given so much importance?
vk: Sir, there is a quotation that ``corruption thrives in secret places%%. The power of the corrut people comes from the information that they possess and not available with the citizen. The tranparency is about providing the citizen wtih the information about the services of the department and the processes involved. There are many tools being advocated like the Right to information, citizens charter, e-governance etc. This will help the citizen to be more clear about the quality of services to expect and how to deal in case of a grievance. The pressure will be there on the officials and the effectiveness of the administration will improve.
2m: What is the difference between Freedom and right to information?
VK: The NDA govt. is actually accused of diluting the original demand and instead giving a Freedom to Information Act. Now, the NCMP promises to introduce Right to information Act. The basic difference is that if it is a right then the citizen will have more power and can initiate legal proceedings also. Otherwise, the official will have discretion in case it is a Freedom.
2m: In S&T, which area do you like the most?
VK: Sir, I like the Space technology.
2m: Can you explain the launch vehicle technology of India?
VK: Sir, India started developing the launch vehicles during 1970s. The frist vehicle was the SLV. The initial test was a failure in 1980. Then the SLVs became a success and the programme was upgraded to the next stage, ie, Augmented Satellite Launch Vehicle (ASLV). Later, the commercial vehicles like the PSLV and the GSLVs were developed during the 1990s. Presently, the ISRO has capacity to launch 2 ton satellites into geo-synchronous orbit. It is in the process of developing GSLV mark 3 which will carry the Insat systems.
2m: Can you explain why the SLV 3 was a failure. What exactly went wrong?
VK: Sorry sir, I don%t know the technical details.
2m: Who led the team of SLV?
VK: Sir, it was led by the Honourable President APJ Abdul Kalam ji.
2m: What is the latest technology used in GSLV?
VK: Sir, the GSLV uses the cryogenic engine in its last satge. Presently, we are using Russian engines, but in near future our cryogenic engines will be ready.
2m: Why do we use cryogenics?
VK: Sir, with present technology only cryogenic engine can be used to place heavy satellites like Insat in a high geostationary orbit. They use low temperatures and the liquid hydragen and liquid oxygen. It is a complicated technology.
2m: Do you know about Hyderabad Central University?
VK: Yes sir, its quite near to my place.
2m: What special things happen there?
VK: Sir, the university is known for its high standards. They have a very good social sciences department, then the management course is also good and the computer science department also has good reputation...
2m: What about the basic sciences?
VK: Yes sir, the basic science is also quite strong in HCU.
2m: What is the difference between Sudershana Kriya and Kapala Bhatu?
VK: Sorry sir, I dont know.
2m: What technology developments take place in Hyderabad?
VK: sir, Hyderabad is main centre for many technological developments. Especially, in defence technology, the complete development of missiles takes place here. Also...
2m: Can name the specific labs of DRDO here?
VK: Sorry sir, I dont know the names.
2m: Any other area of defence tech, say, dont you know about electronics and metallurgy...
VK: Yes sir, the metallurgy related developments are done in MIDHANI.
2m: MIDHANI?!
VK: Sir, I am not sure if it is only for production or if there is research lab attached to it.
2m: Can name some CSIR labs in Hyd.?
VK: Sir, we have the CCMB and the IICT, as far as my knowledge goes.
2m: Can you name the research that takes place in IICT?
VK: Sir, the Chemical related aspects are dealt in this lab. I dont know the specific technologies, but I am aware that IICT is involved in developing alternatives to ozone depleting substances like CFCs, so as to comply with the Montreal Protocal.
2m: But that does not involve India, it is only for the developed nations...
VK: Sir, the IICT is involved in the development of the alternative technology...
2m: Can you name the products developed?
VK: Sorry sir, I dont know the exact technical names.
2m: Mr.Vineel, as a technologist, you must have thought about using creativity and innovation in improving the administration. Can you explain?
VK: Sir, I always believe that the technology can be used to improve administration to be more efficient and citizen friendly. To take a specific example, the biometric systems can be used. They can be applied in ensuring the attendance of the staff. In rural areas, often the staff is absent from their work. The biometric system can be used to ensure compliance. Also, it can be used in identifying the loan beneficiaries. Often, the same group in a village corners all the loans under different schemes. Using biometric systems, this can be avoided. Also...
2m: But these things are already being used. Tell me something more innovative?
VK: (pause for a couple of seconds to think)..
2m: Ok ok,
3 member: Mr. Vineel, are you proud to be an Indian?
VK: Of cource sir, I am proud to be an Indian.
3m: Can you say why, some important factor...
VK: Sir, I particularly like the composite culture of India. If we look at the world, even small nations with hardly one or two communities are not able to exist peacefully. There is so much of conflict. Whereas, in India, every 500 km the language changes, the culture changes. But still we exist as a nation. I believe we have an important message for the world, we are a role model...
3m: What about the achievements in S&T, say in space technology?
VK: Yes sir, we are among handful nations who have the complete technology to manufacture and send satellites into space. Our remote sensing data is of high quality that even the USA is purchasing it from us. It has been a remarkable achievement for India considering the financial and other constraints..
3m: Why do you think India was able to do this?
VK: Sir, I think the visionary leadership of Vikram Sarabhai played a major role. He created leaders at various levels, which ensured the continuity of the programme...
3m: Dont you think Nehru contributed...
VK: Yes sir, Nehru had a great role. He believed that technology can elevate the nation and provided the necessary resources and autonomy to the scientists like Homi Bhabha and Vikram Sarabhai. The foundation was really quite strong.
3m: How will your technological background help you as an administrator?
VK: Sir, firstly I think the problem solving techniques learnt in engineering can as well be applied in administration. The technological background helps in a structured and logical framework of mind, which is useful in any problem solving situation. Then, the tech orientation will always be at the back of the mind. So whenever any new technology comes, we tend to think how it can be applied in improving the administration. Also, sir, I have the contacts with my college friends who are now working in various technology areas and management. We keep discussing the developments on our e-groups. This gives me awareness in latest developments and how they can be applied in administration.
4m: Mr. Vineel, you are having a background in Telugu. I will ask you a question - "Thinte garele thinali, vinte bharatame vinali" (Telugu) who said this?
VK: ... (pause) .. Sir, I think it is said by character in Gurajadas play - "Kanyashulkam" .. (actually, a wrong answer)
4m: Who wrote Andhra mahabharatam?
VK: Sir, by Nannaya, Tikkana and Yerrapragada.
4m: Do you know about the Civil society - its characteristics and the status in India?
VK: Sir, Civil society is a broad term which includes ngos, pressure groups, trade unions etc. In fact, it is not property defined and therefore can include any organisation, which is not related to govt., working on some area of public interest etc. The civil society organisations have developed well in the recent past in India, but there is good potential for improvement. In USA, the civil society is really quite strong.
4m: Can you name some civil society groups?
VK: Sir, we have Sulabh international, Human rights watch, PUCL, CSE, CRY etc.
4m: What do you understand by Third sector?
VK: It is other than the Public and the private sector, sir. In recent times, the Third sector has been given a major role.
4m: Can you specifically tell me the Maoists talks in AP?
VK: Sir, the previous elections had Maoist as the main issue. In fact, there was an assassination of the previous CM...
4m: Assassination or assassination attempt?!...
VK: Sorry sir, I meant assassination attempt. Then the early elections were called out on the issue. The Congress promised in its manifesto that peace talks will be initiated. Therefore after coming to power, the Congress govt initiated the talks and the...
4m: Ok, Ok. Then can you tell me about the Telangana movement. Not about TRS or recent elections, but specifically about the movement.
VK: Sir, the Telangana was part of the Hyderabad state under Nizam. After independence, when the Andhra state was formed, the Telangana area was merged with the Andhra. At that time promises were made regarding Telanganas interests. But, by late 1960s, there was growing discontentment and a feeling of betrayal among the people of Telangana. There started a "Jai Telangana" movement for the separate statehood, and...
4m: Ok, Ok. Do you think small states will lead to development?
VK: Sir, we have many small states which are backward, at the same time there are big states like Maharashtra which are...
4m: But even in Maharashtra there is demand for Vidharba...
VK: Yes sir, there are some relative differences in development. In fact, we cannot have a general rule that only a small state will lead to development. It really depends on the political and administrative skill as to how they use the resources optimally.
GSJ: You have a hobby of reading books. What kind of books do you read?
VK: Sir, I read all types - both fiction and non-fiction, in general. But I like reading about the life stories of great people.
GSJ: Whose biography did you read recently?
VK: Sir, I was reading about Marie Curie, written by her daughter Eve Curie.
GSJ: Which is your favourite fiction?
VK: Sir, I like reading the novels of R.K. Narayan.
GSJ: OK Mr Vineel. Thank You.
VK: Thank You Sir.